Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమిక్రాన్ వైరస్ నుంచి కోలుకున్న తొలి భారతీయడు

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (10:39 IST)
మహారాష్ట్రలో ఒమిక్రాన్ వైరస్ బారినపడిన తొలి రోగి ఆ వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఆయనకు తాజాగా నిర్వహించిన ఒమిక్రాన్ కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ అని వచ్చింది. దీంతో ఆ వ్యక్తిని బుధవారం రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఫలితంగా దేశంలో ఒమిక్రాన్ వైరస్ నుంచి కోలుకున్న తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. 
 
సౌతాఫ్రికాలో ఈ వైరస్ వెలుగు చూసింది. ఈయన కూడా దక్షిణాఫ్రికా నుంచి మహారాష్ట్రలోని థానే జిల్లాకు వచ్చారు. ఈయనకు జరిపిన వైద్య పరీక్షల్లో పాజివిట్‌గా తేలింది. 33 యేళ్ల మెరైన్ ఇంజనీర్‌ను ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచారు. అక్కడ కొన్ని రోజుల చికిత్స తర్వాత పూర్తిగా కోలుకున్నాడు. 
 
మరోవైపు, సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ కొత్త రకం వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇప్పటికే 54 దేశాలకు వ్యాపించింది. మరోవైపు, ఈ వైరస్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments