బీజేపీని కుక్కలా మార్చే సమయం ఆసన్నమైంది : మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్

ఠాగూర్
మంగళవారం, 12 నవంబరు 2024 (14:03 IST)
ఓబీసీ వర్గానికి చెందిన ప్రజలకు ఏమాత్రం గౌరవం లేదని, ఆ వర్గానికి చెందిన ప్రజలను భారతీయ జనతా పార్టీ నేతలు కుక్కలతో పోల్చుతున్నారని, అయితే, ఇపుడు అదే బీజేపీని కుక్కలా పోల్చే సమయం ఆసన్నమైందని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చఫ్ నానా పటోలే ఓటర్లకు పిలుపునిచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా, అకోలాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని బీజీపీ నేతలు కుట్ర పన్ని కూలగొట్టారని, బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తనను తాను దేవుడుగా భ్రమపడుతున్నారని విమర్శించారు. ఓబీసీ కమ్యూనిటీపై బీజేపీ ఏమాత్రం గౌరవం లేదన్న ఆయన మిమ్మల్ని కుక్కలు అంటున్న బీజేపీకి అకోలా జిల్లాలోని ఓబీసీలు ఓటేస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీని ఇపుడు కుక్కలా మార్చే సమయం వచ్చిందన్నారు. 
 
మహారాష్ట్ర నుంచి బీజేపీని పారదోలే సమయం ఆసన్నమైందన్న నానా పటోలే పలు అబద్దాలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఇపుడు దాని స్థానమేంటో చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పారు. బీజేపీ నేతలు తమను తాము దేవుడిగా, విశ్వగురువుగా అనుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ఫడ్నవిస్ కూడా తనను తాను దేవుడుని అనుకుంటూ భ్రమపడిపోతున్నారంటూ విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments