Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాపిల్లలను చంపేసి... మధుర రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం..

ఠాగూర్
మంగళవారం, 12 నవంబరు 2024 (13:31 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. నగల వ్యాపారి ఒకరు తన భార్యాపిల్లను చంపేసి, ఆ తర్వాత మృతదేహాలను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. పిమ్మట తాను కూడా రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నించగా, సీఆర్‌పీఎఫ్ పోలీసులు రక్షించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీకి చెందిన ముకేశ్ వర్మ అనే నగల వ్యాపారికి భార్య రేఖ, కుమార్తెలు భవ్య, కావ్య, కుమారుడు అభిష్త్ అనే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. నాగంతస్తుల భవనంలో సోదరులతో కలిసి జీవిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి భార్యను కత్తితో పొడిచి చంపిన ముకేశ్ వర్మ.. కుమారుడు, కుమార్తెలకు విషమిచ్చి చంపేశాడు. ఆ తర్వాత వారి ఫోటోను తీసి తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. ఆ తర్వాత మధుర ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే, రైల్వే పోలీసులు సకాలంలో స్పందించడంతో ముకేశ్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. 
 
ఇదిలావుంటే, మకేశ్ వాట్సాప్‌ చూసిన కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగువారు ఇంటికి వెళ్లి చూడగా, నాలుగు మృతదేహాలు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ తగాదాలే ఈ దారుణానికి కారణంగా చెపుతున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments