Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్డులో చికిత్స పొందుతున్న రోగి.. చనిపోయాడంటూ మృతదేహం అప్పగింత

అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన రోగి వార్డులో చికిత్స పొందుతుంటే... రోగి చనిపోయాడంటూ వేరొకరి మృతదేహాన్ని అప్పగించిన ఘటన ముంబై నగరంలో చోటుచేసుకుంది. ముంబై మహానగరంలో సంచలనం రేపిన ఈ ఘటన వివరాలను పరిశీ

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (20:23 IST)
అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన రోగి వార్డులో చికిత్స పొందుతుంటే... రోగి చనిపోయాడంటూ వేరొకరి మృతదేహాన్ని అప్పగించిన ఘటన ముంబై నగరంలో చోటుచేసుకుంది. ముంబై మహానగరంలో సంచలనం రేపిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే...
 
ముంబై నగరంలోని తాషేగామ్ ప్రాంతానికి చెందిన అవినాష్ దాదాసాహెబ్ భగ్వాడే (50) కాలేయ సమస్యతో బాధపడుతుండటంతో అతని కుటుంబ సభ్యులు సాంగ్లీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భగ్వాడే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటుండగా ఆసుపత్రి వైద్యులు అతను మరణించాడని చెప్పి మరో వ్యక్తి మృతదేహాన్ని భగ్వాడే కుటుంబసభ్యులకు అప్పగించారు. 
 
మృతదేహానికి పోస్టుమార్టం చేయించి గుడ్డ కట్టి ఉంచడంతో భగ్వాడే కుటుంబసభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. కొందరు బంధువులు భగ్వాడే మృతదేహం కాదని చెప్పడంతో అతని కుటుంబసభ్యులు గుడ్డ తీసి చూడగా గుర్తుతెలియని వ్యక్తి మృతదేహమని వెల్లడైంది. 
 
దీంతో భగ్వాడే కుటుంబసభ్యులు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని తీసుకొని ఆసుపత్రికి వెళ్లగా అక్కడ భగ్వాడే చికిత్సపొందుతూ కోలుకుంటూ కనిపించాడు. బతికున్న రోగి మరణించాడంటూ మరొకరి మృతదేహాన్ని అప్పగించిన ఆసుపత్రి వైద్యుల నిర్వాకంపై భగ్వాడే కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తుచేసి, కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుభోద్ ఉగానే చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments