Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారులకు పోలియో చుక్కల స్థానంలో శానిటైజర్ తాగించారు... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (13:04 IST)
దేశ వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం తాజాగా జరిగింది. ఇందులో ఐదేళ్ళలోపు చిన్నారులకు ఈ చుక్కలు వేశారు. అయితే, మహారాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ హడలెత్తించే ఘటన జరిగింది. యవత్మాల్‌లో ఏర్పాటు చేసిన పోలియో శిబిరంలో పోలియో చుక్కల స్థానంలో శానిటైజర్‌ను చిన్నారులకు తాగించారు. దీంతో ఈ శానిటైజర్ తాగిన వారంతా అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఉదంతం ఘాటాంజీ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే.... యవత్మాల్ పరిధిలోని ఒక గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. అక్కడి ఆరోగ్య కార్యకర్తలు 12 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్‌కు బదులు హ్యాండ్ శానిటైజర్ తాగించారు. దీంతో వారు కొద్దిసేపటి తర్వాత అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరారు.
 
ప్రస్తుతం ఆ చిన్నారులంతా చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరు బాధిత చిన్నారుల తండ్రి కిషన్ శ్యామ్‌రావు మీడియాతో మాట్లాడుతూ తమ పిల్లలకు పోలియో డ్రాప్స్ వేసిన కొద్దిసేపటి తర్వాత వారు వాంతులు చేసుకున్నారన్నారు. 
 
ఈ విషయాన్ని తాము ఆరోగ్య కార్యకర్తలకు తెలియజేయడంతో వారు పోలియో డ్రాప్స్‌కు బదులు హ్యాండ్ శానిటైజర్ తాగించామని తెలిపారన్నారు. తర్వాత వారు తిరిగి తమ చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేశారన్నారు. కాగా ఈ ఉదంతం ఉన్నతాధికారుల వరకూ చేరడంతో వారు ఒక ఆశా కార్యకర్తను సస్పెండ్ చేసి, ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూల్ నటులు అంటారు : వితిక సందేశ్

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments