Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారులకు పోలియో చుక్కల స్థానంలో శానిటైజర్ తాగించారు... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (13:04 IST)
దేశ వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం తాజాగా జరిగింది. ఇందులో ఐదేళ్ళలోపు చిన్నారులకు ఈ చుక్కలు వేశారు. అయితే, మహారాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ హడలెత్తించే ఘటన జరిగింది. యవత్మాల్‌లో ఏర్పాటు చేసిన పోలియో శిబిరంలో పోలియో చుక్కల స్థానంలో శానిటైజర్‌ను చిన్నారులకు తాగించారు. దీంతో ఈ శానిటైజర్ తాగిన వారంతా అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఉదంతం ఘాటాంజీ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే.... యవత్మాల్ పరిధిలోని ఒక గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. అక్కడి ఆరోగ్య కార్యకర్తలు 12 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్‌కు బదులు హ్యాండ్ శానిటైజర్ తాగించారు. దీంతో వారు కొద్దిసేపటి తర్వాత అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరారు.
 
ప్రస్తుతం ఆ చిన్నారులంతా చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరు బాధిత చిన్నారుల తండ్రి కిషన్ శ్యామ్‌రావు మీడియాతో మాట్లాడుతూ తమ పిల్లలకు పోలియో డ్రాప్స్ వేసిన కొద్దిసేపటి తర్వాత వారు వాంతులు చేసుకున్నారన్నారు. 
 
ఈ విషయాన్ని తాము ఆరోగ్య కార్యకర్తలకు తెలియజేయడంతో వారు పోలియో డ్రాప్స్‌కు బదులు హ్యాండ్ శానిటైజర్ తాగించామని తెలిపారన్నారు. తర్వాత వారు తిరిగి తమ చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేశారన్నారు. కాగా ఈ ఉదంతం ఉన్నతాధికారుల వరకూ చేరడంతో వారు ఒక ఆశా కార్యకర్తను సస్పెండ్ చేసి, ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments