Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీపై అత్యాచారం జరిగింది... నువ్విక్కడ చదివితే స్కూల్ పరువుపోద్ది...

అత్యాచారానికి గురైన ఓ బాధితురాలి పట్ల పాఠశాల యాజమాన్యం ప్రవర్తించిన దారుణ ఘటన ఆదివారం నాడు చోటుచేసుకుంది. ఆర్మీ సిబ్బందికి చెందిన ఓ కామాంధుడు రేప్‌ చేయడంతో ఆ 15 ఏళ్ల బాలికను స్కూల్ యాజమాన్యం పాఠశాల నుంచి బహిష్కరించింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్

Webdunia
సోమవారం, 27 నవంబరు 2017 (18:42 IST)
అత్యాచారానికి గురైన ఓ బాధితురాలి పట్ల పాఠశాల యాజమాన్యం ప్రవర్తించిన దారుణ ఘటన ఆదివారం నాడు చోటుచేసుకుంది. ఆర్మీ సిబ్బందికి చెందిన ఓ కామాంధుడు రేప్‌ చేయడంతో ఆ 15 ఏళ్ల బాలికను స్కూల్ యాజమాన్యం పాఠశాల నుంచి బహిష్కరించింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని లాథూర్‌లోని స్థానిక పాఠశాలలో 15 ఏళ్ల బాలిక 11వ తరగతి చదువుతోంది. 
 
ఆమెను పెళ్లాడుతానంటూ నమ్మించిన ఆర్మీ సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెపై అత్యాచారం జరిగిందని తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం ఆమెను పాఠశాలకు రావద్దంటూ, ఆమె అడ్మిషన్ రద్దు చేసి పంపేసింది. ఎందుకిలా చేశారని నిలదీస్తే... స్కూల్ పరువు ప్రతిష్టలు కాపాడేందుకే ఇలా చేసినట్లు పేర్కొనడం గమనార్హం. 
 
మరోవైపు పోలీసులు కూడా బాధితురాలికి న్యాయం చేసేందుకు కేసు నమోదు చేయాలంటే రూ. 50 వేలు లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేసినట్లు బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments