Webdunia - Bharat's app for daily news and videos

Install App

19 మంది విద్యార్థులకు కరోనా +ve: ఒమిక్రాన్‌తో భయం భయం

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (15:40 IST)
ఉత్తరాదిన ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కరోనా మూడో వేవ్‌తో తప్పదని ఇప్పటికే శాస్త్రవేత్తలు హెచ్చరించిన తరుణంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఒమిక్రాన్ కాటేస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోని ఒక పాఠశాలలో 19 మంది పిల్లలకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. 
 
జవహర్ నవోదయ విద్యాలయ అనుబంధ పాఠశాలలో కరోనా వ్యాప్తి కలకలం రేపుతోంది. జిల్లాలోని టాక్లీ ధోకేశ్వర్ గ్రామంలోని రెసిడెన్షియల్ సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాల అయిన జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుతున్న 450 మంది విద్యార్థుల నమూనాలను పరీక్ష కోసం పంపారు. అందులో 19 మంది పాజిటివ్‌గా వచ్చారు. మొత్తం 450 నమూనాల విశ్లేషణ ఇంకా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ రాజేంద్ర భోసలే తెలిపారు.
 
మరోవైపు దేశంలో కొత్త‌గా 7,189 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, శుక్రవారం క‌రోనా నుంచి 7,286 మంది కోలుకోగా, 387 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్ర‌స్తుతం 77,032 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి 3,42,23,263 మంది కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments