19 మంది విద్యార్థులకు కరోనా +ve: ఒమిక్రాన్‌తో భయం భయం

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (15:40 IST)
ఉత్తరాదిన ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కరోనా మూడో వేవ్‌తో తప్పదని ఇప్పటికే శాస్త్రవేత్తలు హెచ్చరించిన తరుణంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఒమిక్రాన్ కాటేస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోని ఒక పాఠశాలలో 19 మంది పిల్లలకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. 
 
జవహర్ నవోదయ విద్యాలయ అనుబంధ పాఠశాలలో కరోనా వ్యాప్తి కలకలం రేపుతోంది. జిల్లాలోని టాక్లీ ధోకేశ్వర్ గ్రామంలోని రెసిడెన్షియల్ సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాల అయిన జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుతున్న 450 మంది విద్యార్థుల నమూనాలను పరీక్ష కోసం పంపారు. అందులో 19 మంది పాజిటివ్‌గా వచ్చారు. మొత్తం 450 నమూనాల విశ్లేషణ ఇంకా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ రాజేంద్ర భోసలే తెలిపారు.
 
మరోవైపు దేశంలో కొత్త‌గా 7,189 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, శుక్రవారం క‌రోనా నుంచి 7,286 మంది కోలుకోగా, 387 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్ర‌స్తుతం 77,032 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి 3,42,23,263 మంది కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments