Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి ఖర్చుల కోసం కిడ్నాప్‌ డ్రామా.. తల్లిదండ్రులకే టోకరా!

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (12:51 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భీండ్‌ జిల్లా గోహద్‌ ప్రాంతానికి చెందిన సందీప్ అనే యువకుడు తన ప్రియురాలి ఖర్చుల కోసం ఏకంగా కిడ్నాప్ డ్రామాకు తెరదీశాడు. తనను తానే కిడ్నాప్ చేసుకున్నాడు. ఆ తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.2.50 లక్షలు ఇస్తేనే మీ పిల్లోడిని వదిలివేస్తామని కిడ్నాపర్లు మాట్లాడినట్టుగా గొంతుమార్చి మాట్లాడాడు. చివరకు పోలీసులకు చిక్కడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
 
సందీప్ అనే యువకుడు తమ ప్రాంతానికే చెందిన ఓ యువతిని గాఢంగా ప్రేమించాడు. ఆమె కోసం ఖర్చు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో తానే కిడ్నాప్‌కు గురైనట్లు నాటకం ఆడాడు. కిడ్నాపర్‌లా గొంతమార్చి మాట్లాడుతూ తల్లిదండ్రులను నమ్మించాడు. కుమారుడిని విడిచిపెట్టాలంటే రూ.2.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. 
 
దీంతో ఈనెల 6న వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. సందీపే కిడ్నాపర్‌ అని వెల్లడైంది. అతని మొబైల్‌ నెట్‌వర్క్‌ లొకేషన్‌ ఆధారంగా పోలీసులు గ్వాలియర్‌లో సందీప్‌ ఆచూకీని గుర్తించి అరెస్టు చేశారు. కిడ్నాప్‌ డ్రామాపై యువకుడిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments