Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.50వేల అప్పు తీర్చేందుకు భార్యను అమ్మేశాడు.. స్నేహితుడితో అత్యాచారం చేయించాడు..

సెల్వి
మంగళవారం, 24 జూన్ 2025 (19:57 IST)
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఒక వ్యక్తి తన భార్యను రూ.50,000 అప్పు తీర్చడానికి అమ్మేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇంకా భార్యపై స్నేహితుడిచే అత్యాచారం చేయించాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఇండోర్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది. వివరాల్లోకి వెళితే.. బాధితురాలి భర్త ధార్ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 35 కి.మీ దూరంలో ఉన్న కన్వాన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతని భార్య ఇండోర్‌లో నివసించింది. 
 
శిక్షార్హమైన నేరానికి సంబంధించి ఫిర్యాదు అందినప్పుడు, అధికార పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్ అయినా 'జీరో' ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. అలా నమోదైన కేసుకు సంబంధించి బాధితురాలి భర్త జూదగాడు అని, ఆ అలవాటు కారణంగా అతని అప్పు పెరుగుతూనే వచ్చిందని కన్వాన్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ అభయ్ నీమా తెలిపారు. 
 
అప్పుల ఊబిలో కూరుకుపోయిన తన భర్త.. తనకు డబ్బు అప్పుగా ఇచ్చిన తన స్నేహితుల్లో ఒకరితో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడని ఆ మహిళ తన ఫిర్యాదులో ఆరోపించిందని ఆయన అన్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న ఇద్దరు పురుషుల కోసం గాలింపు ప్రారంభించామని ఆయన చెప్పారు. భర్త అప్పు తిరిగి చెల్లించలేకపోవడంతో భార్యను రూ.50వేలకు అమ్మేశాడని పోలీసులు అంటున్నారు. 
 
ధార్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) గీతేష్ కుమార్ గార్గ్ మాట్లాడుతూ, "ఈ విషయం దర్యాప్తు చేయబడుతోంది. బాధితురాలి వాంగ్మూలాన్ని ఇండోర్‌లో నమోదు చేస్తామని" తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments