ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ వివాహేతర సంబంధం మరో వ్యక్తిని పొట్టబెట్టుకుంది. తన ప్రియుడుతో కలిసి కట్టుకున్న భర్తను భార్య హత్య చేయించింది. మేనత్త కొడుకుతో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత.. తన ప్రియుడుతో కలిసి భర్తను కడతేర్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
నాగ్లా హిమాచల్ గ్రామానికి చెందిన రుషి కుమార్ (30) అనే వ్యక్తి ఓ ట్రక్ డ్రైవరుగా పని చేస్తున్నడు. ఈయనకు రెండేళ్ల క్రితం రిషికి లలిత అనే యువతితో వివాహమైంది. పెళ్ళయిన తర్వాత లలిత తరచుగా తన మేనత్త ఇంటికి వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో స్వయానా రుషి బాబాయి సౌదాన్ సింగ్తో లలిత మేనత్తకు పెళ్లయింది. సౌదాన్ సింగ్ కుమారుడు నీరేశ్. మేనత్త ఇంటికి వచ్చిపోయే క్రమంలో నీరేశ్కు లలిత దగ్గరైంది.
రుషి డ్రైవింగ్ పనిపై ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి ప్రాంతాలకు వెళ్లినపుడు ఇదే అదునుగా భావించిన లలిత తన ప్రియుడు నీరేశ్తో కలిసి ఎంజాయ్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో తన భర్త అడ్డు తొలగించుకుంటే తామిద్దరం సంతోషంగా ఉండొచ్చని లలిత భావించింది. ఈ విషయాన్ని తన ప్రియుడు నీరేశ్కు లలిత చెప్పింది.
ఈ క్రమంలో నీరేశ్ సోదరుడు బబ్లూకు జూన్ 17వ తేదీన పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ పెళ్లి కోసం 10 నుంచి 12 రోజులకు ముందే మేనత్త ఇంటికి లలిత, రుషి దంపతులు వచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన బబ్లూ పెళ్లి ముగియగానే, తన ప్రియుడుతో కలిసి లలిత తన భర్త రుషిని హత్య చేశారు. తుపాకీతో కాల్చడంతో పెద్ద శబ్దం వచ్చింది.
ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ఇంట్లోనివారంతా అక్కడకు చేరుకోవడంతో ఈ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నీరేశ్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడైంది. దీంతో లలితను కూడా అరెస్టు చేసింది.