Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడిని మింగేసిందన్న అనుమానంతో మొసలికి చిత్రహింసలు

Webdunia
గురువారం, 14 జులై 2022 (09:10 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ మొసలిని గ్రామస్థులు చిత్రహింసలకు గురిచేశారు. బాలుడిని మింగేసిందన్న అనుమానంతో గ్రామస్థులు ఈ పనికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ష్యోపుర్‌ జిల్లా రిఝెంటా గ్రామానికి చెందిన పదేళ్ల బాలుడు అతర్‌ సింగ్‌ సోమవారం చంబల్‌ నదిలో స్నానానికి వెళ్లాడు. కాసేపటి తర్వాత కనిపించకుండా పోయాడు. బాలుడిని మొసలి మింగేసిందని గ్రామస్థులంతా అనుకున్నారు. ఓ వల తెచ్చి దాన్ని పట్టుకున్నారు. ఒడ్డుకు లాక్కొచ్చి తాళ్లతో కట్టేశారు. 
 
బాలుడికి ఆక్సిజన్‌ అందడం కోసమని మొసలి నోరు తెరిచి ఉంచేలా పెద్ద కర్ర పెట్టారు. చివరకు పొట్ట చీల్చి, బాలుడిని బయటకు లాగడానికి ప్రయత్నిస్తూ చిత్రహింసలు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు.. గ్రామస్థులకు నచ్చజెప్పి.. మొసలిని తిరిగి నదిలో విడిచిపెట్టారు. బాలుడి కోసం గాలించగా.. మంగళవారం నదిలో శవమై కనిపించాడు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments