Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మవారి ఆలయంలో నాలుక కోసుకున్న భక్తురాలు

Blade
, శనివారం, 25 జూన్ 2022 (09:58 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ భక్తురాలు అమ్మావారి ఆలయంలో బ్లేడుతో నాలుక కోసుకుంది. దీంతో ఆలయంలో ఉన్న ఇతర భక్తులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ఘటన ఎంపీలోని సిధీ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఈ జిల్లాలోని బడా గ్రామానికి చెందిన 20 ఏళ్ల రాజ్‌కుమారీ పటేల్‌.. గురువారం తల్లిదండ్రులతో పాటు స్థానికంగా ఉండే అమ్మవారి ఆలయానికి వచ్చింది. పూజ చేస్తుండగా ఉన్నట్లుండి యువతి తన నాలుకను కోసేసుకుని ఆ విగ్రహం పాదాల వద్దకు విసిరేసింది. యువతి వైఖరి చూసి తల్లిదండ్రులతో పాటు అక్కడ ఉన్న వారు షాకయ్యారు. 
 
ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వైద్యులను వెంట పెట్టుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతికి ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. అమ్మవారికి బలి ఇవ్వాలనే ఆలోచనతో ఆమె ఈ పనిచేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెలగావి జిల్లాలో ఏడు పిండాల అవశేషాలు.. భ్రూణ హత్యలు