Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పదేళ్ళ బాలుడిని మింగేసిన మొసలి.. ఎక్కడ?

crocodile
, బుధవారం, 13 జులై 2022 (07:38 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షీపుర్‌లో ప్రతి ఒక్కరూ విస్తుపోయే, ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఓ పదేళ్ళ బాలుడిని మొసలి ఒకటి అమాంతం మింగేసింది. బాలుడు నదిలో స్నానం చేసుండగా, చడీచప్పుడు లేకుండా వచ్చిన మొసలి అతడిపై దాడి చేసి నీటిలోకి లాక్కెళ్లి, ఆ తర్వాత మింగేసింది. మొసలి దాడిచేసే సమయంలో అక్కడ ఉన్న ప్రజలు ఆ మొసలిని కర్రలతో కొట్టి, వలల సాయంతో పట్టుకుని ఒడ్డుకు చేర్చారు. అయితే, మొసలి మాత్రం బాలుడుని మింగేసింది. 
 
ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ అధికారులు అక్కడికి చేరుకుని, మొసలిని తిరిగి నీటిలోకి వదిలివేయాలని కోరారు. కానీ, గ్రామస్థులు ససేమిరా అన్నారు. దాని కడుపులో తమ బిడ్డ బతికే ఉండొచ్చని, ఉమ్మివేసేంతవరకూ వదిలేది లేదని కుటుంబీకులు తేల్చిచెప్పారు. మొసలి మింగేస్తే చనిపోయి ఉంటాడని, బతికిఉండే అవకాశం లేదని పోలీసులు, అటవీ అధికారులు నచ్చజెప్పడంతో ఎట్టకేలకు సాయంత్రం నాటికి ఆ మొసలిని విడిచిపెట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పక్షవాతం బారినపడిన తండ్రిని కొట్టి చంపేసిన తనయుడు