ఆవులు గల్లంతైతే.. చేతులు నరికేస్తారా?

అవును ఆవులు గల్లంతైన పాపానికి.. 35 ఏళ్ల వ్యక్తిని చెట్టుకు కట్టేసి చేతులు నరికేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆవులు గల్లంతైన వ్యవహారంలో ఘర్షణ కారణంగా ఈ దారుణం జరిగిందని వార్తలు వస్తున్నాయి.

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (11:54 IST)
అవును ఆవులు గల్లంతైన పాపానికి.. 35 ఏళ్ల వ్యక్తిని చెట్టుకు కట్టేసి చేతులు నరికేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆవులు గల్లంతైన వ్యవహారంలో ఘర్షణ కారణంగా ఈ దారుణం జరిగిందని వార్తలు వస్తున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని పిపల్‌వాలి గ్రామంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. ఆవులు కనిపించడం లేదంటూ ప్రేమ్‌ నారాయణ్‌ సాహూ అనే వ్యక్తి సత్తూ యాదవ్‌ గోశాలకు వెళ్లి ఆరా తీశారు. ఈ విషయమై ఘర్షణ జరగడంతో యాదవ్‌, ఆయన కుటుంబ సభ్యులు సాహుపై దాడికి పాల్పడ్డారు. సాహును తీవ్రంగా కొట్టి చెట్టుకు కట్టేసి కత్తితో అతని చేతులు నరికేశారు. 
 
బాధితుడు సాయం చేయాలని అరిచినా గ్రామస్తులు ముందుకు రాలేదని పోలీసులు తెలిపారు. స్థానికులు సమాచారం అందించడంతో స్పందించిన పోలీసులు సాహూను ఆస్పత్రికి తరలించారు. బాధితుడిపై దాడికి పాల్పడిన కుటుంబంపై హత్యా యత్నం కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, యాదవ్ భార్య, ఆ ఇంటి పని మనిషి, కుమారుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments