Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంట చేయడం ఆలస్యమైందని భార్యను కొట్టి బావిలో తోసిన భర్త

Webdunia
గురువారం, 26 మే 2022 (17:09 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. వంట చేయడం ఆలస్యం కావడాన్ని జీర్ణించుకోలేని ఓ కిరాతక భర్త కట్టుకున్న భార్యను చితకబాది పక్కనే ఉన్న బావిలో నెట్టేశాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస్ ప్రాంతం, తిల్యాఖేదీలో దినేశ్ మాలి అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. ఆయన పని నుంచి ఇంటికి తిరిగిరాగానే భార్య యశోదను ఇంకా వంట కాలేదా? అని అడిగాడు. అయితే, తాను ఇంకా వంట చేయలేదని, కొంత సమయం పడుతుందని సమాధానమిచ్చింది. 
 
ఈ సమాధానంతో ఆగ్రహంతో ఊగిపోయిన దినేశ్ మాలి భార్యను చితకబాదాడు. ఇంతలో కుమార్తె నిఖిత అడ్డురాగా ఆమెను కూడా చావబాదాడు. భార్యను కొట్టిన దెబ్బలకు ఆమె కిందపడిపోయింది. అప్పటికీ అతని ఆగ్రహం చల్లారకపోవడంతో ఆమెను పక్కనే ఉన్న బావిలో నెట్టేసి అక్కడ నుంచి పారిపోయాడు. 
 
ఈ విషయాన్ని కుమార్తె నిఖిత తన బంధువులకు తెలియజేసింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకుని బావిలో ఉన్న యశోద మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. దినేష్ మాలిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments