Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంట చేయడం ఆలస్యమైందని భార్యను కొట్టి బావిలో తోసిన భర్త

Webdunia
గురువారం, 26 మే 2022 (17:09 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. వంట చేయడం ఆలస్యం కావడాన్ని జీర్ణించుకోలేని ఓ కిరాతక భర్త కట్టుకున్న భార్యను చితకబాది పక్కనే ఉన్న బావిలో నెట్టేశాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస్ ప్రాంతం, తిల్యాఖేదీలో దినేశ్ మాలి అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. ఆయన పని నుంచి ఇంటికి తిరిగిరాగానే భార్య యశోదను ఇంకా వంట కాలేదా? అని అడిగాడు. అయితే, తాను ఇంకా వంట చేయలేదని, కొంత సమయం పడుతుందని సమాధానమిచ్చింది. 
 
ఈ సమాధానంతో ఆగ్రహంతో ఊగిపోయిన దినేశ్ మాలి భార్యను చితకబాదాడు. ఇంతలో కుమార్తె నిఖిత అడ్డురాగా ఆమెను కూడా చావబాదాడు. భార్యను కొట్టిన దెబ్బలకు ఆమె కిందపడిపోయింది. అప్పటికీ అతని ఆగ్రహం చల్లారకపోవడంతో ఆమెను పక్కనే ఉన్న బావిలో నెట్టేసి అక్కడ నుంచి పారిపోయాడు. 
 
ఈ విషయాన్ని కుమార్తె నిఖిత తన బంధువులకు తెలియజేసింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకుని బావిలో ఉన్న యశోద మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. దినేష్ మాలిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments