Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ చేస్తే ఉరే : బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇకపై కామాంధుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించనుంది. ఎవరైనా అత్యాచారానికి పాల్పడినట్టయిదే ఉరితీయనుంది.

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2017 (17:57 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇకపై కామాంధుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించనుంది. ఎవరైనా అత్యాచారానికి పాల్పడినట్టయిదే ఉరితీయనుంది. ఈ మేరకు రాష్ట్ర శాసనసభలో ఓ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది.
 
ముఖ్యంగా, 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలకు పాల్పడే వారికి ఇకపై ఉరిశిక్ష విధించనున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. 
 
ఇటీవలే ఈ బిల్లుకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఓకే చెప్పగా తాజాగా బిల్లుకు ఆమోద ముద్ర పడింది. ఇక మిగిలింది రాష్ట్రపతి ఆమోదమే. అది కూడా పూర్తయితే.. అత్యాచార దోషులకు ఉరిశిక్ష విధిస్తారు. 
 
దోషులుగా తేలిన వారిని చనిపోయేంత వరకు ఉరితీయాలని బిల్లులో పేర్కొన్నారు. ఈ బిల్లు చట్టంగా మారితే ఈ తరహా శిక్షను అమలు చేసే తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ అవతరిస్తుంది. 
 
కాగా, ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, అభంశుభం తెలియని పసిబిడ్డలపై కూడా కామాంధులు అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దీంతో మధ్యప్రదేశ్ రాష్ట్ర సర్కారు కఠిన వైఖరి అవలంభించాలని నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments