Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పనిభారంతో ఆంబులెన్స్ డ్రైవర్ మృతి, మెడలో తాళి కుదువబెట్టి అంత్యక్రియలు చేసిన భార్య

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (14:18 IST)
కర్నాటక రాష్ట్రానికి చెందిన ఉమేష్, రాష్ట్ర ఆంబులెన్స్ విభాగంలో డ్రైవరుగా విధులు నిర్వహిస్తున్నాడు. గత రెండు నెలలుగా కరోనా బాధితుల కోసం రేయింబవళ్లు పనిచేస్తూ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. విశ్రాంతి లేని కారణంగా అతడు తీవ్ర ఒత్తిడికి లోనై గుండెపోటుకు గురై కన్నుమూశాడు.
 
ఈ నేపధ్యంలో దహనక్రియలకు తన దగ్గర కావల్సినంత డబ్బు లేకపోవడంతో భార్య తన మెడలో వున్న తాళిబొట్టును కుదవబెట్టి భర్త దహనక్రియలను పూర్తి చేసింది. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర ఆవేదనను కలిగించింది. మరిణించిన ఉమేష్‌కి ఇద్దరు పిల్లలు వుండటంతో తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అతడి భార్య విన్నవించింది.
 
ఈ విషాద ఘటన తెలుసుకున్న కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, సీఎం సహాయనిధి నుంచి రూ. 5 లక్షలు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఉమేష్ భార్య తన భర్త లాక్ డౌన్ ప్రకటించిన మూడు నెలలుగా విశ్రాంతి లేకుండా విధులు నిర్వహించడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యారనీ, దీనితో ఆకస్మిక గుండెపోటు సంభవించడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారని తెలిపింది. తమ కుటుంబానికి ఆధారమైన తన భర్త చనిపోవడంతో ఏ ఆధారంలేకుండో పోయిందని, ప్రభుత్వమే తమకు ఏదయినా ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments