Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్డ్ కాల్ కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.. కానీ..?

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (14:02 IST)
వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. అపరిచిత ఫోన్‌ కాల్ ద్వారా ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఆ స్నేహం కాస్త ప్రాణాలను బలిగొంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం, బెంగుళూరులోని మాదావరలో నివాసం ఉండే చంద్రశేఖర్ (20)కు చిన్నాదేవి అగ్రహారకు చెందిన ఒక వివాహిత మహిళ మిస్డ్ కాల్ ద్వారా పరిచయం అయ్యింది. 
 
ఈ పరిచయం కాస్తా రోజూ ఫోన్‌లో చాటింగ్ చేసుకునే దాకా వెళ్లింది. కొన్నాళ్లకు ఆ స్నేహం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరూ ఎవరికి తెలియకుండా కాపురం కూడా పెట్టారు. విషయం తెలుసుకున్న వివాహిత మహిళ భర్త, వీరిని వెతికి పట్టుకుని తన భార్యను ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంత జరిగి, ఇంటికి వెళ్లినా ఆమె మళ్లీ తన ప్రియుడితో స్నేహం కొనసాగిస్తూనే ఉండేది. కొన్నాళ్లకు మళ్లీ ప్రియుడితో వెళ్లిపోయింది.
 
భార్య రెండో సారి ప్రియుడితో వెళ్లిపోవటం తట్టుకోలేని భర్త, చంద్రశేఖర్‌ని చంపాలని నిర్ణయించుకున్నాడు. తన బంధువులతో కలిసి, చంద్రశేఖర్ ఎక్కడున్నాడో తెలుసుకుని అక్కడికెళ్లి అతడిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమలో పూర్తిగా మునిగిపోతే తికమక చేస్తుంది : త్రిష

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments