Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఐ అధికారిని చితక్కొట్టిన గ్రామస్థులు.. ఎందుకు? ఎక్కడ?

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (08:58 IST)
ఒరిస్సా రాష్ట్రంలోని ఓ సీబీఐ అధికారిపై గ్రామస్థులు దాడి చేశారు. లైంగికదాడి కేసులో నిందితుని అతని ఇంట్లో విచారిస్తుండగా ఈ సంఘటన జరిగింది. విచారణ కొనసాగుతుండగానే గ్రామస్తులు ఆ అధికారులపై దాడిచేశారు. వారున్న ఇంటికి తాళంవేసి వారిని నిర్బంధించారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. గ్రామం నుంచి వారిని సురక్షితంగా తీసుకెళ్లిన ఘటన ఒడిశాలోని దేనకనాల్ జిల్లాలో జరిగింది.
 
ఆన్‌లైన్‌లో చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడుతున్న ముఠాలే లక్ష్యంగా సీబీఐ అధికారులు దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని 77 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఒడిశాలోని దేనకనాల్ జిల్లాకు చెందిన మిథున్‌ నాయక్‌ను అతని ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్లారు.
 
నిందితుడిని విచారిస్తుండగా అతని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సీబీఐ బృందంపై దాడికి దిగారు. వారిపై కర్రలతో దాడి చేశారు. పరిస్థితి విషమించడంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు సీబీఐ అధికారులను అక్కడినుంచి పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం