Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు... అద్వానీకి 100 ప్రశ్నలు.. 4 గంటల పాటు..?

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (23:19 IST)
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో భాజపా అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్‌ కృష్ణ అద్వానీ వాంగ్మూలాన్ని లఖ్‌నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు నమోదు చేసింది. మసీదు కూల్చివేత కేసులో 49 మంది నిందితుల పేర్లను సీబీఐ నమోదు చేయగా, వారిలో 32 మంది సజీవంగా ఉన్నారు. వారందరి నుంచి సీఆర్‌పీసీలోని 313 సెక్షన్‌ కింద వాంగ్మూలాల నమోదు ప్రక్రియ జరుగుతోంది. 
 
తాజాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అద్వానీ స్టేట్‌మెంట్‌ను కోర్టు నాలుగు గంటల పాటు రికార్డు చేసింది. శుక్రవారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు సాగిన ఈ సుదీర్ఘ విచారణలో అద్వానీని దాదాపు 100కు పైగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. 
 
ఈ విచారణలో తనపై వచ్చిన ఆరోపణలను అద్వానీ ఖండించారని ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు. ఈ కోర్టు విచారణ నేపథ్యంలో బుధవారం రోజున అద్వానీ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇద్దరు నేతలూ దాదాపు 30 నిమిషాల పాటు చర్చించారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments