Webdunia - Bharat's app for daily news and videos

Install App

లెఫ్ట్ పార్టీల పతనం.. రేపటికి విపత్తుకు కారణం : జైరాం రమేష్

దేశంలో లెఫ్ట్(వామపక్ష)పార్టీల అంతం రేపటికి విపత్తుకు కారణభూతమని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆందోళన వ్యక్తంచేశారు. త్రిపురలో కమ్యూనిస్టుల కంచుకోట బద్దలైన నేపథ్యంలో దేశానికి బల

Webdunia
బుధవారం, 7 మార్చి 2018 (10:17 IST)
దేశంలో లెఫ్ట్(వామపక్ష)పార్టీల అంతం రేపటికి విపత్తుకు కారణభూతమని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆందోళన వ్యక్తంచేశారు. త్రిపురలో కమ్యూనిస్టుల కంచుకోట బద్దలైన నేపథ్యంలో దేశానికి బలమైన వామపక్షం ఉండాల్సిన అవసరముందన్నారు. 
 
త్రిపురలో లెఫ్ట్ ఫ్రంట్ ఓడిపోయిన 48 గంటల్లోపే వారి రాజకీయ ప్రత్యర్థులు చెలరేగిపోయారు. భారీగా హింసాకాండకు దిగి కారల్ మార్క్స్, లెనిన్ విగ్రహాలను కూల్చివేశారు. సీపీఎం కార్యాలయాలపై, ఆ పార్టీ కార్యకర్తల గృహాలపై దాడులు, దహనాలకు పాల్పడ్డారు. ఈ హింసలో ఇద్దరు మృతి చెందారు. బెలోనియా జిల్లా కేంద్రంలోని పబ్లిక్ స్కేర్‌లో ఉన్న ఐదడుగుల లెనిన్ విగ్రహాన్ని బుల్డోజర్‌తో కూల్చేశారు. 
 
ఈ పరిణామాలపై జైరాం రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ వామపక్షాలు అంతమవుతున్న తీరు రేపటి విపత్తుకు కారణభూతమవుతుందన్నారు. మేం వామపక్ష పార్టీలతో పోరాడుతాం. మా పోరాటాలు రాజకీయాలకే పరిమితం. అయితే వామపక్ష పార్టీలు అంతమై పోవడాన్ని మన దేశం అంత త్వరగా భరించదు అని ఆయన వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments