Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల్లో ఓటమికి ఎవరు బాధ్యత వహిస్తారు : నితిన్ గడ్కరీ

Webdunia
ఆదివారం, 23 డిశెంబరు 2018 (10:30 IST)
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురైన ఓటమికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశ్నించారు. విజయం సాధించినపుడు అంతా తమ గొప్పేనని చెప్పుకునే నాయకులు... ఓడిపోయినపుడు మాత్రం బాధ్యత వహించేందుకు ఎవరూ ముందుకురారని ఆయన కేంద్ర బీజేపీ నాయకత్వాన్ని ఉద్దేశించి ప్రరోక్షంగా ప్రశ్నించారు. 
 
పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, వైఫల్యాలు, ఓటములకు కూడా నాయకత్వం బాధ్యత వహించాలని అన్నారు. 'విజయానికి ఎంతోమంది తండ్రులు ఉంటారు. కానీ, వైఫల్యం అనాథ. విజయం సాధించినప్పుడు ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోవడానికి పోటీ పడతారు. కానీ, ఓడిపోతే మాత్రం, ప్రతి ఒక్కరూ ఇతరులను వేలెత్తి చూపడానికే ప్రయత్నిస్తారు' అని వ్యాఖ్యానించారు. ఓటములు, వైఫల్యాలకు కూడా బాధ్యత తీసుకునే లక్షణం నాయకత్వానికి ఉండాలని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments