Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ లాంఛనాలతో లతాజీ అంత్యక్రియలు - ప్రధాని నివాళులు

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (18:52 IST)
గాన కోకిల, భారతరత్న లతా మంగేష్కర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ముంబైలోని శివాజీ పార్కులో జరిగిన ఈ అంత్యక్రియల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని, లతా మంగేష్కర్‌కు ఆఖరిసారి నివాళులు అర్పించారు. అలాగే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా హాజరయ్యారు. 
 
గత నెలలో కరోనా వైరస్ బారినపడిన లతా దీదీ అప్పటి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆమె ఆరోగ్యం విషమించి ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 
 
ఒకవైపు కరోనా వైరస్, మరోవైపు న్యుమోనియాతో పాటు అంతర్గత అవయవాలు పాడైపోవడం వల్ల ఆమె చనిపోయారని ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఆమె పార్థివ దేహాన్ని తొలుత ఆస్పత్రి నుంచి ప్రభుకుంజ్‌లోని ఆమె నివాసానికి తరలించారు. ఆ తర్వాత సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఆమె అంత్యక్రియలు పూర్తిచేశారు. 
 
ఇందులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు, బాలీవుడ్ స్టార్స్ షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి బడా హీరోలు కూడా పాల్గొని లతా దీదీని కడసారి చూసి నివాళులు అర్పించారు. 
 
ఇదిలావుంటే, లతా మంగేష్కర్ మరణానికి సంతాపంగా జాతీయ పతాకాన్ని రెండు రోజుల పాటు అవనతం చేయాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. ఆది, సోమవారాలు త్రివర్ణ పతాకాన్ని దేశ వ్యాప్తంగా సగం ఎత్తులోనే జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments