Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చన్నీ

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (17:47 IST)
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చరణ్జీత్ సింగ చన్నీ పేరును ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆదివారం లుథియానాలో జరిగిన ఓ వర్చువల్ ర్యాలీలో రాహుల్ ప్రకటన చేశారు. తద్వారా గత కొన్ని రోజులుగా సాగుతున్న చర్చకు ఆయన తెరదించారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన పేరును ప్రకటిస్తారని ఆశిస్తూ వచ్చిన పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ ఆశలపై రాహుల్ గాంధీ నీళ్లు చల్లారు. 
 
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో అత్యధికుల అభిప్రాయం మేరకే ప్రస్తుత ముఖ్యమంత్రి చన్నీ పేరును మళ్లీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించినట్టు ఆయన పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం పంజాబ్‌లో 32 శాతం మేరకు దళిత వర్గానికి చెంది సిక్కుల ఓట్లు ఉన్నాయి. ఇది కూడా చన్నీని సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి ఓ కారణంగా చెప్పొచ్చు. 
 
కాగా, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్‌కు పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న అమరీందర్ సింగ్‌కు మధ్య ఏర్పడిన వివాదాల కారణంగా సీఎం పదవికి అమరీందర్ రాజీనామా చేశారు. ఆ తర్వాత పార్టీ నుంచి తప్పుకున్నారు. పిమ్మట ఆయన బీజేపీలో చేరనున్నారనే వార్తలు హల్చల్ చేశాయి. కానీ, ఆయన బీజేపీతో చేతులు కలపకుండా ఒంటరిగానే ప్రయాణిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments