Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మా ఆకలేస్తోంది.. లేవకపోవటంతో ఏడ్చాడు.. చివరికి?

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2022 (16:36 IST)
బీహార్ రాష్ట్రంలోని భాగల్ పుర్ రైల్వే స్టేషన్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రైల్వే ప్లాట్ ఫాంపై కన్నతల్లి చనిపోయింది. ఆ విషయం తెలియని ఐదేళ్ల కుమారుడు అమ్మ మెడ చుట్టూ చేతులువేసి ఒడిలో నిద్రపోయాడు. 
 
కొద్దిసేపటికి లేచి అమ్మా ఆకలేస్తోంది అంటూ చెప్పినా అమ్మ లేవకపోవటంతో ఏడ్వటం మొదలు పెట్టాడు. ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో భాగల్ పుర రైల్వే పోలీసులు మహిళ మృతి చెందిన ప్రదేశానికి వచ్చి ఆమె మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు. 
 
చిన్నారిని శిశు సంరక్షణ కేంద్రం అధికారులకు అప్పగించారు. అయితే మృతురాలి వివరాలు తెలుసుకోవడానికి తల్లీ కుమారుడి ఫొటోలను పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. 
 
అయినా ఎవరూ సంప్రదించక పోవటంతో గురువారం పోలీసులే ఆ మహిళలకు అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలి మరణానికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక వచ్చాక తెలుస్తాయని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments