Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మా ఆకలేస్తోంది.. లేవకపోవటంతో ఏడ్చాడు.. చివరికి?

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2022 (16:36 IST)
బీహార్ రాష్ట్రంలోని భాగల్ పుర్ రైల్వే స్టేషన్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రైల్వే ప్లాట్ ఫాంపై కన్నతల్లి చనిపోయింది. ఆ విషయం తెలియని ఐదేళ్ల కుమారుడు అమ్మ మెడ చుట్టూ చేతులువేసి ఒడిలో నిద్రపోయాడు. 
 
కొద్దిసేపటికి లేచి అమ్మా ఆకలేస్తోంది అంటూ చెప్పినా అమ్మ లేవకపోవటంతో ఏడ్వటం మొదలు పెట్టాడు. ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో భాగల్ పుర రైల్వే పోలీసులు మహిళ మృతి చెందిన ప్రదేశానికి వచ్చి ఆమె మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు. 
 
చిన్నారిని శిశు సంరక్షణ కేంద్రం అధికారులకు అప్పగించారు. అయితే మృతురాలి వివరాలు తెలుసుకోవడానికి తల్లీ కుమారుడి ఫొటోలను పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. 
 
అయినా ఎవరూ సంప్రదించక పోవటంతో గురువారం పోలీసులే ఆ మహిళలకు అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలి మరణానికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక వచ్చాక తెలుస్తాయని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి ల రిసెప్షన్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments