Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి బొమ్మ : సుబ్రహ్మణ్యం స్వామి

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (07:19 IST)
భారతీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి బొమ్మను ముద్రించాలని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి కేంద్రప్రభుత్వానికి సూచించారు. అలా చేస్తే అందరికీ మేలు జరుగుతుందని చెప్పారు.

ఇండోనేషియా కరెన్సీ నోట్లపై గణేశుని బొమ్మను ముద్రించిన విషయాన్ని ప్రస్తావిస్తూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు స్వామి స్పందించారు. సుబ్రహ్మణ్యం స్వామి మధ్య ప్రదేశ్‌లోని ఖాండ్వాలో ‘స్వామి వివేకానంద వ్యాఖ్యానమాల’ శీర్షికతో ప్రసంగించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు.

ఇండోనేషియా కరెన్సీ నోట్లపై గణేశుని బొమ్మ ముద్రించిన విషయాన్ని విలేకర్లు ప్రస్తావించినపుడు స్వామి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. తాను దీనికి అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు.

గణేశుడు విఘ్నాలను తొలగిస్తాడని చెప్పారు. లక్ష్మీదేవి బొమ్మను కరెన్సీ నోట్లపై ముద్రిస్తే, భారతీయ కరెన్సీ పరిస్థితిని మెరుగుపడవచ్చునని చెప్పారు. దీని గురించి ఎవరూ చెడుగా అనుకోవలసిన అవసరం లేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments