Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల ఉసురు తీస్తున్నారు : లఖింపూర్ ఖైరీ ఘటనపై కేటీఆర్ ట్వీట్

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (16:29 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరి ఘటనపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనను అనాగరిక చర్యగా అభివర్ణించిన ఆయన... రైతుల ఉసురు తీసిన ఆ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
 
కేంద్రం తెచ్చిన వివాదస్పద సాగు చట్టాలపై నిరసన తెలుపుతున్న రైతులపై నిర్దాక్షిణ్యంగా కారు తోలి హత్య చేయడం తనను కలచివేసిందని పేర్కొన్నారు. 
 
లఖింపూర్ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో మరణించిన బాధిత కుంటుంబాలకు త్వరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు కేటీఆర్ అన్నారు.
 
కాగా, లఖీంపూర్ ఖేరీలో దేశం మొత్తాన్ని దిగ్భాంతి పరిచిన విషయం తెల్సిందే. ఈ హింసాత్మక ఘటనలకు నిరసనగా యూపీ నుంచి ఢిల్లీ వరకూ నిరసనలు చెలరేగాయి. రైతు సంఘాల నేతలు, ప్రతిపక్షాలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాయి. 

 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments