Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దుర్మార్గులు రైతులనే కాదు... జర్నలిస్టునూ హత్య చేశారు...

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (15:51 IST)
ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్‌లో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా టెని కుమారుడు ఆశిష్, నిరసన తెలుపుతున్న రైతులపైకి కారు తోలి నలుగురు రైతులను పొట్ట‌న‌పెట్టుకున్న సంఘటన‌లో ఒక జర్నలిస్ట్ కూడా అమరుడయ్యాడు. లఖింపూర్ ఘటన సమయంలో నిఘాసన్‌కి చెందిన  జర్నలిస్ట్ రామన్ కశ్యప్ అదృశ్యమయ్యారు. ఆయ‌న గురించి ఆచూకీ తీయ‌గా, చివ‌రికి ఆ జర్నలిస్ట్ మృతదేహాన్నిరాత్రి ఆసుపత్రిలో కనుగొన్నారు.
 
అతను సాధనా న్యూస్ ఛానల్ వీడియో జర్నలిస్ట్. సంఘటన స్థలానికి సంబంధించిన విజువల్స్ తీస్తుండగా, వేగంగా వచ్చిన వాహనం వారిని ఢీకొనడంతో రోడ్డు పక్కన ఉన్న గుంటలో పడిపోయాడు. రామన్ కశ్యప్‌కు ఇద్దరు చిన్న కుమార్తెలు ఉన్నారు. చిన్న అమ్మాయి పాలు తాగే పసిపాప. ఇంత దుర్మార్గంగా జ‌ర్న‌లిస్టును పొట్ట‌న‌పెట్టుకున్నార‌ని స్థానిక జర్నలిస్ట్ లు చాలా ఆగ్రహంతో ఉన్నారు.  మృతుని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, యాభై లక్షలు పరిహారంగా ఇవ్వాల‌ని జ‌ర్న‌లిస్టు సంఘాలు డిమాండు చేస్తున్నాయి. హత్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు. 
 
ప్రెస్ జనరల్ ఆఫ్ ఇండియా ధీరజ్ గుప్తా, శిశిర్ శుక్లా సీనియర్ అధికారులతో సహా వందలాది మంది జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. జ‌ర్న‌లిస్టు కుటుంబాన్ని ఆదుకోవాల‌ని, పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments