Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తేజ్ పై యానిమేషన్లు ఆపి, చిన్నారికి న్యాయం చేయండి

తేజ్ పై యానిమేషన్లు ఆపి, చిన్నారికి న్యాయం చేయండి
విజయవాడ , మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (16:03 IST)
తెలుగు టీవీ న్యూస్ ఛాన‌ళ్ళపై టాలీవుడ్ న‌టుడు మంచు మ‌నోజ్ సెటైర్ వేశారు. హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్ పై యానిమేష‌న్లు వేయ‌డం ఆపి, న్యూస్ ఛానళ్ళు ద‌ళిత బాలిక కుటుంబానికి న్యాయం జ‌రిగేలా చూడాల‌ని ఘాటుగా విమ‌ర్శించారు.
 
న‌టుడు మంచు మనోజ్ సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్నారికి జరిగింది క్రూరత్వం అని, దీనికి మనందరం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల‌ని, ఆడ పిల్లలను ఎలా గౌరవించాలో అందరికీ నేర్పాల‌ని అన్నారు. ఈ కిరాత‌కానికి పాల్ప‌డిన నిందితుడు ఇంకా దొరకలేదని పోలీసులు అంటున్నారు... ప్రభుత్వం, పోలీసులు దీనిని సీరియస్ గా తీసుకోవాల‌ని సూచించారు. 
 
చత్తీస్ఘడ్ లో మూడేళ్ళ క్రితం చిన్నారిపై జరిగిన హత్యాచారం కేసులో ఉరిశిక్ష వేయాలని ఇప్పుడు తీర్పు వచ్చింద‌ని, న్యాయం ఇంత ఆల‌స్యం కాబ‌ట్టే, సంఘ‌ట‌న‌లు పునరావృతం అవుతున్నాయ‌ని అన్నారు. నిందితుల‌ను 24 గంటల్లో పట్టుకొని కఠినంగా శిక్షించాల‌ని న‌టుడు మంచు మ‌నోజ్ అన్నారు. టీవీ చానళ్లలో సాయి ధరమ్ తేజ్ గురించి యనిమేషన్లు వేయకుండా,  ఇలాంటి వాళ్లకు న్యాయం జరిగేలా చూడాల‌ని సూచించారు. చిన్నారి ఫామిలీకి ఎల్లవేళలా తాము తోడుగా ఉంటామ‌న్నారు మంచు మ‌నోజ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తీవ్ర అస్వస్థతకు లోనైన ఆర్.కృష్ణయ్య