Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తీవ్ర అస్వస్థతకు లోనైన ఆర్.కృష్ణయ్య

తీవ్ర అస్వస్థతకు లోనైన ఆర్.కృష్ణయ్య
, మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (15:51 IST)
తెలుగు రాష్ట్రాలకు చెందిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓ ధర్నాలో పాల్గొన్న ఆయన స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణా రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పని చేస్తున్న గెస్ట్ టీచర్లకు మద్దతు తెలుపుతూ హైదరాబాదులోని బషీర్ బాగ్‌లో ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం వద్ద బీసీ సంక్షేమ సంఘం ధర్నా నిర్వహించింది.
 
ఈ ధర్నాలో ఆర్.కృష్ణయ్య కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆయనను హుటాహుటిన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆత్మ‌హ‌త్య య‌త్నం చేసిన కె.జి.హెచ్. లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని