Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెడికో హత్యాచార కేసు : ఆర్జీ కర్ వైద్య కాలేజీ ప్రిన్సిపాల్ అరెస్టు!

ఠాగూర్
సోమవారం, 2 సెప్టెంబరు 2024 (22:26 IST)
కోల్‌కతా మెడికో హత్యాచార కేసులో ఆర్జీ కర్ వైద్య కాలేజీ ఆస్పత్రి ప్రిన్సిపాల్‌ సందీప్ ఘోష్‌ను సీబీఐ అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయన వద్ద ఏకంగా 16 రోజుల పాటు ప్రశ్నించింది. హత్యాచార కేసు, ఆర్థిక అవకతవకల కేసుల్లో ఆయన వద్ద ఈ విచారణ జరిగింది. 
 
గత నెల 9వ తేదీన ఆర్జీ కర్ వైద్య కాలేజీ ఆస్పత్రి సెమినార్ హాల్లో ఓ మహిళా జూనియర్ డాక్టర్ హత్యాచారానికి గురైన విషయం తెల్సిందే. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే పౌర వాలంటీర్‌ను అరెస్టు చేశారు. అయితే, మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ వైఖరి అనుమానాస్పదంగా ఉండటంతో సీబీఐ ఈ కేసు విచారణ చేపట్టి నుంచి ఆయనను ప్రశ్నిస్తూ వచ్చింది. పలుమార్లు ఆయన నివాసంలో సోదాలు కూడా నిర్వహించింది. 
 
జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనలోనూ, ఆర్జీ కర్ వైద్య కాలేజీలో జరిగిన ఆర్థిక అవకతవకల విషయంలోనూ సీబీఐ సమాంతర దర్యాప్తు చేపట్టింది. ఈ రెండు కేసుల్లోనూ సందీప్ ఘోష్‌ను సీబీఐ 16 రోజుల పాటు సుధీర్ఘంగా లోతుగా ప్రశ్నించింది. ఈ క్రమంలో ఆయనను సోమవారం అరెస్టు చేసినట్టు సీబీఐ ప్రకటించింది. అయితే, ఈ కేసులో ఆయనను అరెస్టు చేశారన్న విషయం మాత్రం స్పష్టం చేయలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం