Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతాలో కూలిన వంతెన.. బస్సులు, కార్లు చిక్కుకుపోయాయి

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పురాతన బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఈ వంతెన కింద బస్సులు, కార్లు చిక్కుకుపోయాయి. దక్షిణ కోల్‌కతా, అలీపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మెజర్‌హట్ అని పిలువబడే ఈ బ్రిడ్జి నగరం

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (18:00 IST)
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పురాతన బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఈ వంతెన కింద బస్సులు, కార్లు చిక్కుకుపోయాయి. దక్షిణ కోల్‌కతా, అలీపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మెజర్‌హట్ అని పిలువబడే ఈ బ్రిడ్జి నగరంలోని పురాతన వంతెనల్లో ఒకటి. ఈ వంతెన కింద రైల్వే ట్రాక్. పైన వాహనాలు వెళ్లేందుకు వీలుంటుంది. 
 
ఈ బ్రిడ్జి పురాతన కాలం నాటిది కావడంతో ఒక్క సారిగా కుప్పకూలింది. 2016 మార్చిలో సెంట్రల్ కోల్‌కతాలోని బుర్రబజార్‌లో కూడ బ్రిడ్జి కుప్పకూలింది. ఈ ఘటనలో సుమారు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజుల తరబడి సహాయక చర్యలు చేసి శిథిలాల కింద ఉన్న వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో సుమారు 90 మందికి పైగా గాయపడ్డారు. 
 
తాజాగా మంగళవారం చోటుచేసుకున్న కోల్‌కతా వంతెన కూలిన ప్రమాదంలో ఏడుగురు గాయాలపాలైయ్యారు. తొమ్మిది మందిని ఇప్పటికే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ముమ్మరంగా సహాయక చర్యలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments