Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి ప్రపోజల్.. నో చెప్పిందని పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. చివరికి?

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (15:01 IST)
పెళ్లికి ప్రపోజల్ పెట్టాడు. కానీ యువతి తిరస్కరించడంతో ప్రేమోన్మాది పెట్రోల్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతీయువకులు మృతి చెందారు.  కేరళలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఎర్నాకుళం జిల్లా కక్కనాడ్‌కు చెందిన 17 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని దేవిక వెంటపడ్డాడు మిథున్ అనే యువకుడు. 
 
పెళ్లి చేసుకుంటానంటూ ప్రపొజల్ పెట్టాడు. కానీ అతడి ప్రతిపాదనను సదరు యువతి తిరస్కరించింది. ఇంకా ఇంటికి సమాచారం చేరవేసింది. అంతే ఏకంగా ఆ యువతి ఇంటికే వెళ్లాడు. యువతి తల్లిదండ్రులతో మాట్లాడాడు. 
 
దేవిక మైనర్ కావడంతో యువతి తల్లిదండ్రులు ఇప్పుడే కుదరదని చెప్పేశారు. ఇంకా ఆ యువకుడి తీరు నచ్చకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కూడా పెళ్లికి నో చెప్పారు. దాంతో పగ పెంచుకున్న మిథున్ అదను చూసి యువతిపై దాడికి దిగాడు. బుధవారం ట్యూషన్ వెళ్లొస్తున్న దేవికతో పెళ్లి చేసుకోమని గొడవపడ్డాడు. అంతటితో ఆగకుండా రాత్రి ఆమె ఇంటికి వెళ్లి నానా రచ్చ చేశాడు. 
 
పెళ్లికి అంగీకరించాలని ఎంత పట్టుబట్టినా.. దేవిక వినిపించుకోకపోవడంతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ మంటలు కాస్తా మిథున్‌కు కూడా అంటుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో దేవిక తండ్రికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments