Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేరళ : జాలీ ఖాతాలో మరికొన్ని హత్యలు..

కేరళ : జాలీ ఖాతాలో మరికొన్ని హత్యలు..
, గురువారం, 10 అక్టోబరు 2019 (13:50 IST)
కేరళ రాష్ట్రంలో వరుస హత్యలకు పాల్పడిన సీరియల్ ఉమెన్ కిల్లర్ జాలీ ఖాతాలో మరికొన్ని హత్యలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె చంపింది, చంపించింది ఆరుగురిని కాదని, ఇంకా చాలా మందినని తెలుస్తోంది. 
 
ముఖ్యంగా, 2002లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోగా, ఆ ప్రమాదాన్ని జరిపించింది కూడా జాలీయేనని తాజాగా వెల్లడి కావడం మరింత సంచలనమైంది. 
 
ఆస్తికోసం కోసం అత్తమామలు సహా మొత్తం ఆరుగురు కుటుంబ సభ్యుల హత్యకు పాల్పడినట్లు జాలీ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జాలీ పోలీసుల అదుపులో ఉంది.
 
ఈమె మొదటి భర్త రాయ్‌థామస్‌ సమీప బంధువు ఎల్సమ్మ అనే మహిళ మీడియాతో మాట్లాడుతూ జాలి మరిన్ని హత్యలకు పాల్పడినట్లు వెల్లడించింది. 2002లో తన కుమారుడు సునీష్‌ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని, ఆ ప్రమాదం చేయించింది జాలీయేనని ఎల్సమ్మ చెబుతోంది.
 
అలాగే విన్సెంట్‌ అనే వ్యక్తి ఆత్మహత్యకు, స్థానిక కాంగ్రెస్‌ నేత రామకృష్ణ మృతి వెనుక జాలీ హస్తం ఉందని ఆరోపించింది. దీంతో ఎల్సమ్మ తెలిపిన వివరాల మేరకు కేసు పునర్విచారణ చేస్తామని ఎస్పీ కె.జి.సమోన్‌ తెలిపారు. 
 
జాలీలో స్ప్లిట్ పర్సనాలిటీ..
కేరళ సీరియల్ ఉమెన్ కిల్లర్ జాలీ కథ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 14 యేళ్లలో ఆరుగురిని హత్య చేసిన ఈ మహిళ పైకి చలాకీగా నవ్వుతూ, మాయమాటలతో మభ్యబెట్టి మట్టుబెట్టినట్టు తేలింది. ఆమె గురించి ఆసక్తికరమైన వరుస కథనాలు వస్తున్నాయి. 
 
ఈ సైకో ఉమెన్ కిల్లర్‌పై కేసును విచారిస్తున్న డీజీపీ లోక్‌నాథ్ బెహరా మాట్లాడుతూ, జాలీ... పైకి చలాకీగా నవ్వుతూ కనిపిస్తూ, అందరితోనూ చక్కగా మాట్లాడేదని చెప్పారు. మంచి గృహిణిగా పేరు తెచ్చుకుందని తెలిపారు.
 
అయితే, ఇదంతా నాణానికి ఓ వైపు మాత్రమేనని, మరో వైపు చూస్తే, 14 ఏళ్లలో ఆరుగురిని హత్య చేసిందని తెలిపారు. జాలీలో స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని భావిస్తున్నామని, ఒక్కో సమయంలో సైకోగా మారే ఆమె, తినే ఆహారంలో సైనైడ్ కలుపుతూ ఒక్కొక్కరినీ మట్టుబెట్టిందన్నారు. 
 
అందుకే ఆమెకు సైకో అనాలిసిస్ పరీక్షలు నిర్వహించనున్నామని లోక్‌నాథ్ తెలిపారు. ఈ కేసు పోలీసులకు చాలా సంక్లిష్టమైనదని, విచారణకు మంచి సైకాలజిస్టుల సాయం తప్పనిసరిగా తీసుకుంటామన్నారు. 
 
అయితే, జాలీ బంధువులు మాత్రం, ఆమె అమాయకురాలని చెబుతుండటం గమనార్హం. ఆమెను కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జాలీ స్నేహితులు కూడా ఆమె వరుస హత్యలు చేసిందంటే నమ్మలేకున్నామని చెప్పడం ఇపుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. తన భర్త మరిదిపై మోజుపడిన జాలీ... భర్తతో పాటు.. మొత్తం ఆరుగుని హతమార్చిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనంతపురం నుంచి కంటివెలుగు.. ప్రారంభించిన సీఎం జగన్