Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక రాజ్యసభలో అడుగు పెట్టనున్న సినీ నటి ఖుష్బూ?

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (13:56 IST)
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఇటీవలే బీజేపీలో చేరిన తమిళ నటి ఖుష్బూ త్వరలో కర్ణాటక రాజ్య సభలో అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యత్వానికి బీజేపీ అధిష్ఠానం ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకకు చెందిన రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ ఇటీవల కరోనాతో కన్నుమూసారు. ఈ స్థానానికి డిసెంబరు ఒకటో తేదీన ఎన్నిక జరగనుండగా ఆ సీటు కోసం ఖుష్బూ పేరును బీజేపీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నకవ్వడం ఇక్కడ సర్వసాధారణమే. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి ఒకరిని ఎన్నిక చేస్తే ఆ ఎన్నికల్లో లబ్ది పొందవచ్చని బీజేపీ యోచనగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా ముగ్గురు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
 
వీరిలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, కర్ణాటకలో సేవలు అందించిన ఐపీఎస్ అధికారి అన్నామలై, సినీ నటి ఖుష్బూ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే బీజేపీ పరిశీలనను రజినీకాంత్ అంగీకరించే అవకాశం లేదని తెలిస్తోంది. మిగిలిన ఆ ఇధ్దరిలో ఖష్బూను ఎంపిక చేస్తే రాష్ట్రంలో బీజేపీ ఇమేజ్ పెరుగుతుందని ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు భావిస్తున్నారు. మరో నాలగైదు రోజుల్లో ఖుష్బూ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments