కొడైకెనాల్‌‌లో ఖమ్మం టెక్కీ యువజంట ఆత్మహత్య... జీతాలు రాక, ఆర్థిక సమస్యలతో...

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (17:52 IST)
తెలంగాణకు చెందిన ఓ యువ జంట కొడైకెనాల్‌లో బలవన్మరణానికి పాల్పడ్డారు. కరోనా కారణంగా గత మూడు నెలలుగా జీతాలు లేకపోవడంతో దంపతులు ఇద్దరూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాధమిక సమాచారం.
 
 ఇక వివరాలు పరిశీలిస్తే.. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం మంగళగూడెం గ్రామానికి చెందిన బోజడ్ల గోపీకృష్ణ(26) భద్రాచలం సమీపంలోని చోడవరం గ్రామానికి చెందిన ఏపూరి నందిని(26) ఇద్దరూ భార్యాభర్తలు.
 
2018లో ప్రేమ వివాహం చేసుకున్న వీరు కొడైకెనాల్‌లోని అన్నయ్‌ థెరెస్సా యూనివర్సిటీ సమీపంలోని ఓ ఇంట్లో ఏడాది కాలంగా నివాసముంటున్నారు. స్థానిక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున కిరాణా సరుకులు సరఫరా చేసే యువకుడు వారి ఇంటికి వెళ్లగా తలుపులు తీయలేదు.
 
ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో లోపలికి చూశాడు. దంపతులిద్దరూ నోట్లో నుంచి నురగలు కక్కి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. కాగా గోపీకృష్ణ దంపతులు కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్నారని విచారణలో ఆ యువకుడు పోలీసులకు తెలిపాడు.
 
గత 3 నెలలుగా జీతాలు సరిగా రావడం లేదని చెప్పినట్లు వివరించాడు. అయితే దంపతులిద్దరూ కొద్దికాలంగా ఆస్ట్రేలియా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ ప్రయత్నాలు ఫలించడంలేదన్న బాధ కూడా వున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments