Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... 100 మంది పోలీసులకు కరోనావైరస్.. ఎక్కడ?

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (17:37 IST)
చంద్రగిరి మండలం, కళ్యాణి డ్యామ్ వద్దగల పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో సుమారు 100 మంది శిక్షణార్థులు కరోనావైరస్ బారిన పడ్డారు. వివిధ జిల్లాలకు చెందిన సుమారు 380 మంది పోలీసులు డిసెంబర్ నుంచి శిక్షణ పొందుతున్నారు. దీంతో కళాశాలను మూసివేసిందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
 
చంద్రగిరిలోని పోలీసు ట్రైనింగ్ సెంటర్లో వైజాగ్ టౌన్, కాకినాడ, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 380 మంది కానిస్టేబుళ్ళు శిక్షణ పొందుతున్నారు. సెప్టెంబర్‌తో వీరి శిక్షణ పూర్తి కానుంది. అయితే లాక్‌డౌన్ సడలింపుతో శిక్షణ పొందుతున్న ట్రైనీలు వారివారి స్వగ్రామాలకు వెళ్ళి వచ్చారు. 
 
ఈ నేపథ్యంలో కరోనా లక్షణాలతో ఇబ్బందులు పడుతున్న ట్రైనీలకు కళాశాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు సుమారు 100 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లు విశ్వసనీయ సమాచారం. వీరందరినీ సెల్ఫ్ క్వారంటైన్లో ఉంచినట్లు తెలుస్తోంది. మరికొందరి టెస్టు ఫలితాలు రావాల్సి ఉంది.
 
వైరస్ విస్తృతంగా వ్యాపిచడంతో కాలేజ్‌కు కొంతకాలం సెలవులు ప్రకటించే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. రంగంపేట పంచాయతీ సిబ్బంది కళాశాలలో శానిటేషన్, పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments