Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... 100 మంది పోలీసులకు కరోనావైరస్.. ఎక్కడ?

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (17:37 IST)
చంద్రగిరి మండలం, కళ్యాణి డ్యామ్ వద్దగల పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో సుమారు 100 మంది శిక్షణార్థులు కరోనావైరస్ బారిన పడ్డారు. వివిధ జిల్లాలకు చెందిన సుమారు 380 మంది పోలీసులు డిసెంబర్ నుంచి శిక్షణ పొందుతున్నారు. దీంతో కళాశాలను మూసివేసిందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
 
చంద్రగిరిలోని పోలీసు ట్రైనింగ్ సెంటర్లో వైజాగ్ టౌన్, కాకినాడ, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 380 మంది కానిస్టేబుళ్ళు శిక్షణ పొందుతున్నారు. సెప్టెంబర్‌తో వీరి శిక్షణ పూర్తి కానుంది. అయితే లాక్‌డౌన్ సడలింపుతో శిక్షణ పొందుతున్న ట్రైనీలు వారివారి స్వగ్రామాలకు వెళ్ళి వచ్చారు. 
 
ఈ నేపథ్యంలో కరోనా లక్షణాలతో ఇబ్బందులు పడుతున్న ట్రైనీలకు కళాశాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు సుమారు 100 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లు విశ్వసనీయ సమాచారం. వీరందరినీ సెల్ఫ్ క్వారంటైన్లో ఉంచినట్లు తెలుస్తోంది. మరికొందరి టెస్టు ఫలితాలు రావాల్సి ఉంది.
 
వైరస్ విస్తృతంగా వ్యాపిచడంతో కాలేజ్‌కు కొంతకాలం సెలవులు ప్రకటించే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. రంగంపేట పంచాయతీ సిబ్బంది కళాశాలలో శానిటేషన్, పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments