వామ్మో... 100 మంది పోలీసులకు కరోనావైరస్.. ఎక్కడ?

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (17:37 IST)
చంద్రగిరి మండలం, కళ్యాణి డ్యామ్ వద్దగల పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో సుమారు 100 మంది శిక్షణార్థులు కరోనావైరస్ బారిన పడ్డారు. వివిధ జిల్లాలకు చెందిన సుమారు 380 మంది పోలీసులు డిసెంబర్ నుంచి శిక్షణ పొందుతున్నారు. దీంతో కళాశాలను మూసివేసిందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
 
చంద్రగిరిలోని పోలీసు ట్రైనింగ్ సెంటర్లో వైజాగ్ టౌన్, కాకినాడ, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 380 మంది కానిస్టేబుళ్ళు శిక్షణ పొందుతున్నారు. సెప్టెంబర్‌తో వీరి శిక్షణ పూర్తి కానుంది. అయితే లాక్‌డౌన్ సడలింపుతో శిక్షణ పొందుతున్న ట్రైనీలు వారివారి స్వగ్రామాలకు వెళ్ళి వచ్చారు. 
 
ఈ నేపథ్యంలో కరోనా లక్షణాలతో ఇబ్బందులు పడుతున్న ట్రైనీలకు కళాశాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు సుమారు 100 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లు విశ్వసనీయ సమాచారం. వీరందరినీ సెల్ఫ్ క్వారంటైన్లో ఉంచినట్లు తెలుస్తోంది. మరికొందరి టెస్టు ఫలితాలు రావాల్సి ఉంది.
 
వైరస్ విస్తృతంగా వ్యాపిచడంతో కాలేజ్‌కు కొంతకాలం సెలవులు ప్రకటించే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. రంగంపేట పంచాయతీ సిబ్బంది కళాశాలలో శానిటేషన్, పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments