Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్స్‌పైరింగ్ మెసేజెస్ పేరిట.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్ (video)

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (17:08 IST)
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో తన యూజర్లకు మరోకొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. ఎక్స్‌పైరింగ్ మెసేజెస్ పేరిట ఆ ఫీచర్ యూజర్లకు లభిస్తుంది. వాట్సాప్‌లో పంపే మెసేజ్‌లు కొంత నిర్దిష్టమైన సమయం తరువాత వాటికవే ఆటోమేటిగ్గా అదృశ్యమయ్యేలా ఫీచర్‌ను తెస్తున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి.

అయితే వాటిని వాట్సాప్ త్వరలో నిజం చేయనుంది. ఎందుకంటే ఆ ఫీచర్‌ను ప్రస్తుతం బీటా యాప్‌లో పరీక్షిస్తున్నారు. అందువల్ల ఆ ఫీచర్ అతి త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. 
 
ఈ ఎక్స్‌ఫైరింగ్ మెసేజేస్ ద్వారా ఇక వాట్సాప్‌లో యూజర్ పంపే మెసేజ్ ఎంత సేపటి తరువాత అదృశ్యం అవ్వాలో సెట్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తారు.


ఒక రోజు, ఒక వారం లేదా ఒక నెల.. ఇలా యూజర్ తనకు ఇష్టం వచ్చినట్లు ఆ సదుపాయాన్ని సెట్ చేసుకోవచ్చు. దీంతో ఆ యూజర్ పంపే మెసేజ్‌లు ఆ సమయం తరువాత వాటికవే అదృశ్యమవుతాయి.

అయితే గ్రూప్‌లలో పంపే మెసేజ్‌లకు మాత్రం అడ్మిన్ ముందుగా సెట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఫీచర్ అతి త్వరలోనే వాట్సాప్ యూజర్లకు లభ్యం కానుంది.
 

సంబంధిత వార్తలు

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

ఆ హీరోయిన్ల విషయంలో ఎందుకు అలా అడుగుతారో అర్థం కాదు : సోనాక్షి సిన్హా

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments