Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో ముద్దు ఎమోజీ పంపించిన స్నేహితుడు.. అనుమానంతో ఇద్దరిని హత్య చేసిన భర్త!

ఠాగూర్
మంగళవారం, 4 మార్చి 2025 (15:12 IST)
పొరుగింట్లో ఉన్న ఓ వివాహితకు ఓ స్నేహితుడు వాట్సాప్ ద్వారా ముద్దు ఎమోజీని పంపించాడు. ఇది తీవ్ర వివాదానికి దారితీయడంతో పాటు ఇద్దరి హత్యకు కారణమైంది. కేరళ రాష్ట్రంలో ఆదివారం చోటుచేసుకున్న హత్య కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
కేరళ రాష్ట్రంలోని పథనంపట్టి జిల్లా కలంజూరుకు చెందిన బైజు, తన భార్య వైష్ణవి (28)తో కలిసి ఉంటుంన్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి ఇంటి పక్కనే విష్ణు (30) అనే వ్యక్తి తన తల్లితో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో వైష్ణవి వాట్సాప్ నంబరుకు విష్ణు ఒకసారి ముద్దు ఎమోజీని పంపించాడు. ఇది చూసిన బైజు తన భార్యతో గొడవకు దిగాడు. భర్తకు భయపడిన వైష్ణవి... పక్కనే ఉన్న తన స్నేహితుడు విష్ణు ఇంటిలోకి పారిపోయింది. ఇది బైజుకు మరింత ఆగ్రహం తెప్పించింది. 
 
కొడవలితో విష్ణు ఇంటికి చేరుకున్న బైజు... భార్యను పెరట్లోకి లాక్కెళ్ళి నరికాడు. దీన్ని ఆపేందుకు ప్రయత్నించి విష్ణుపై  కూడా దాడి చేశారు. ఈ దాడిలో వారిద్దరూ తీవ్రంగా గాయపడగా స్థానికులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత బైజు తన స్నేహితులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగా, వారు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బైజును అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments