Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పేరుతో టెక్కీతో సీఐఎస్ఎఫ్ అధికారిణి పడకసుఖం ... సీన్ కట్ చేస్తే...

ఠాగూర్
మంగళవారం, 4 మార్చి 2025 (13:58 IST)
బెంగుళూరులో ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తే ఓ వ్యక్తితో సీఐఎస్ఎఫ్‌లో ఉన్నతాధికారిణిగా పనిచేసే ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. పెళ్లి చేసుకుంటాని టెక్కీని నమ్మించి తన కామవాంఛ తీర్చుకుంది. తీరా సీన్ కట్ చేస్తే.. ఆ టెక్కీని మోసం చేసింది. ఈ మోసాన్ని భరించలేని ఆ టెక్కీ ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నాటక రాష్ట్రంలోని మంగుళూరులో ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజిపూర్‌‍కు చెందిన అభిషేక్ (40) అనే వ్యక్తి బెంగుళూరులోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈయనకు సీఐఎస్ఎఫ్‌లో ఉన్నతాధికారిగా పనిచేసే ఓ మహిళ పరిచయమైంది. అప్పటి నుంచి వారిద్దరూ తరచుగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో టెక్కీని పెళ్లి చేసుకుంటానని ఆ మహిళ నమ్మించి, తన లైంగిక కోర్కెలను తీర్చుకుంది. 
 
ఆ తర్వాత ఆమె టెక్కీతో సంబంధాలు తెంచుకుంది. ఆ తర్వాత ఆమె గురించి ఆరా తీయగా, ఆమెకు ఇదివరకే వివాహమై ఉన్నట్టు గ్రహించాడు. దీన్ని జీర్ణించుకోలేని టెక్కీ, మంగుళూరులోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆ మహిళాధికారి ప్రస్తుతం కర్నాటకలో విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం