Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో మళ్లీ వెలుగు చూసిన నోరోవైరస్ - బాధితులుగా ఇద్దరు చిన్నారులు

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (11:20 IST)
కేరళ రాష్ట్రంలో సరికొత్త వైరస్ వెలుగు చూసింది. గతంలో ఒకసారి ఈ వైరస్ కనిపించింది. ఇపుడు వళింజమ్ అనే ప్రాంతంలో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకింది. అయితే, ఈ వైరస్ సోకిన బాధిత చిన్నారుల ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. 
 
తమ రాష్ట్రంలో కొత్తగా నోరోవైరస్ కేసులు నమోదైనట్టు ఆమె తెలిపారు. పైగా, కలుషిత ఆహారం, అతిసార ఫిర్యాదుల నేపథ్యంలో పళంజమ్‌లోని ఎల్ఎంఎస్ఎల్‌పీ పాఠశాల విద్యార్థుల నుంచి నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రజారోగ్య పరిశోధనా కేంద్రానికి పంపించినట్టు తెలిపారు. 
 
అదేసమయంలో ఈ వైరస్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఈ వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ఆరోగ్య శాఖ అన్ని రకాల నివారణ చర్యలు చేపట్టిందని తెలిపారు. వయనాడులోని వెటర్నరీ కాలేజీకి చెందిన 13 మంది విద్యార్థులకు గతంలో నోరోవైరస్ బారినపడ్డారు. 
 
ఆ వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంతో అపుడు నియంత్రణలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ తరహా కేసులో నమోదు కాలేదు. కానీ ఇపుడు మళ్లీ ఈ వైరస్ ఇద్దరు చిన్నారుల్లో వెలుగు చూసింది. 
 
ఇదిలావుంటే, ఆహారం లేదా కలుషి ద్రవాల ద్వారా నోరోవైర్ వ్యాప్తి చెందుతుంది. వైరస్ ఉన్న ఉపరితలాలు, వస్తువులను తాకడం ద్వారా గానీ, అది సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉండటం వల్లగానీ ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments