Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం

ఠాగూర్
శుక్రవారం, 10 మే 2024 (11:28 IST)
ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయం శుక్రవారం ఉదయం తెరుచుకుంది. వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయం అధికారులు తెరిచారు. అనంతరం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కుటుంబంతో కలిసి తొలి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేదారేశ్వరుడికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజల నిర్వహించారు. 
 
పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్ ఆలయం ఒకటి. చార్‌ధామ్ యాత్రలో కేదార్‌నాథ్ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ప్రతి యేటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు పరమేశ్వరుడి దర్శనం కోసం కేదార్‌నాథ్‌కు వస్తుంటారు. కానీ, శీతకాలం సందర్భంగా ఈ ఆలయాన్ని మూసివేస్తారు. దాదాపు ఆరు నెలల పాటు ఇలాగే ఆలయం మూసి ఉంచడం జరుగుతుంది. 
 
నేడు ఆరు నెలల తర్వాత తిరిగి తెరిచిన సందర్భంగా అధికారుల ఆలయాన్ని పువ్వులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సుమారు 40 క్వింటాళ్ల పూలతో అందంగా ముస్తాబు చేశారు. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి క్యూ కట్టారు. మరోవైపు, యమునోత్రి ఆలయం కూడా ఉదయం 7 గంటలకే తెరుచుకుంది. గంగోత్రి ఆలయం మాత్రం మధ్యాహ్నం 12.20 గంటలకు తెరుచుకుంది. ఇక చార్‌ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల12వ తేదీ తెరవనున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments