Publish Date: Sat, 27 Jan 2024 (10:12 IST)
Updated Date: Sat, 27 Jan 2024 (10:14 IST)
ఆంధ్రప్రదేశ్లోని తిరుమల ఆలయంలో నిరంతరం భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. అంతకుముందు శుక్రవారం నాడు, స్వామి ఆశీర్వాదం కోసం 71,664 మంది వ్యక్తులు ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి భక్తుల నుంచి భారీగా కానుకలు కూడా వచ్చాయి.
హుండీలో రూ.3.37 కోట్లు జమయ్యాయి. టైమ్ స్లాట్ టిక్కెట్లు కలిగి ఉన్నవారికి, దర్శనం కోసం వేచి ఉండే సమయం సుమారు ఐదు గంటల సమయం వుంది. అయితే టిక్కెట్లు లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం దాదాపు 18 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది.