Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వామ్మో.. శ్రీవారి హుండీకి అంత ఆదాయమా? నెలల వారీగా...

garuda seva in tirumala
, మంగళవారం, 2 జనవరి 2024 (10:34 IST)
గత యేడాది తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)కి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. అలాగే, గత యేడాది కాలంలో ఏకంగా 2.54 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. శ్రీవారి హుండీకి భక్తులు సమర్పించిన కానుకల కారణంగా తితిదే ఆదాయం రూ.1403.74 కోట్లుగా సమకూరింది. గత యేడాది ఒక్క జనవరి నెలలోనే 20.78 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ నెలలో రూ.123.07 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే, ఫిబ్రవరి నెలలో హుండీ ద్వారా రూ.114.29 కోట్ల ఆదాయం రాగా, 18.42 లక్షల మంది శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. 
 
మార్చి నెలలో 20.57 లక్షల మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.120.29 కోట్లుగా ఉంది. ఏప్రిల్ నెలలో 20.95 లక్షల మంది దర్శనం చేసుకోగా, రూ.114.12 కోట్ల ఆదాయం సమకూరింది. మే నెలలో 23.38 లక్షల మంది దర్శనం చేసుకోగా, రూ.109.99 కోట్ల ఆదాయం వచ్చింది. జూన్ నెలలో 23 లక్షల మంది దర్శనం చేసుకోగా, రూ.116.14 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. జూలై నెలలో 129.08 కోట్లు, ఆగస్టు నెలలో రూ.120.05 కోట్లు, సెప్టెంబరు నెలలో రూ.111.65 కోట్లు, అక్టోబరు నెలలో రూ.108.65 కోట్లు, నవంబరు నెలలో రూ.108.46 కోట్లు, డిసెంబరు నెలలో రూ.116.07 కోట్ల మేరకు హుండీ ఆదాయం వచ్చినట్టు తితిదే అధికారులు వెల్లడించారు. 
 
గత యేడాది జనవరి మూడో తేదీన వైకుంఠ ఏకాదరి సందర్భంగా రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం రూ.7.68 కోట్లు లభించగా, ఇటీవల వైకుంఠ ఏకాదశి రోజున రూ.5.05 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా, కోవిడ్ మహమ్మారి తర్వాత 2022 మార్చి నెల నుంచి ప్రత్యేక దర్శనాలతో పాటు టోకెన్ రహిత దర్శనాలు, ఆర్జిత సేవలన్నీ ప్రారంభమైన క్రమంలో హుండీ ఆదాయం ప్రతి నెల రూ.100 కోట్లు దాటుతూ వస్తుంది. 2022 మార్చి నుంచి డిసెంబరు వరకు రూ.1291.69 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిర్యానీ రుచిగా లేదన్న కస్టమర్లు... చితకబాదిన హోటల్ సిబ్బంది... ఎక్కడ?