Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్డ్ కాల్ కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.. కానీ..?

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (14:02 IST)
వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. అపరిచిత ఫోన్‌ కాల్ ద్వారా ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఆ స్నేహం కాస్త ప్రాణాలను బలిగొంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం, బెంగుళూరులోని మాదావరలో నివాసం ఉండే చంద్రశేఖర్ (20)కు చిన్నాదేవి అగ్రహారకు చెందిన ఒక వివాహిత మహిళ మిస్డ్ కాల్ ద్వారా పరిచయం అయ్యింది. 
 
ఈ పరిచయం కాస్తా రోజూ ఫోన్‌లో చాటింగ్ చేసుకునే దాకా వెళ్లింది. కొన్నాళ్లకు ఆ స్నేహం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరూ ఎవరికి తెలియకుండా కాపురం కూడా పెట్టారు. విషయం తెలుసుకున్న వివాహిత మహిళ భర్త, వీరిని వెతికి పట్టుకుని తన భార్యను ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంత జరిగి, ఇంటికి వెళ్లినా ఆమె మళ్లీ తన ప్రియుడితో స్నేహం కొనసాగిస్తూనే ఉండేది. కొన్నాళ్లకు మళ్లీ ప్రియుడితో వెళ్లిపోయింది.
 
భార్య రెండో సారి ప్రియుడితో వెళ్లిపోవటం తట్టుకోలేని భర్త, చంద్రశేఖర్‌ని చంపాలని నిర్ణయించుకున్నాడు. తన బంధువులతో కలిసి, చంద్రశేఖర్ ఎక్కడున్నాడో తెలుసుకుని అక్కడికెళ్లి అతడిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments