Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతిలో బిడ్డతో వెళ్తున్న మహిళ.. వెనుక నుంచి ఎక్కిదిగిన జీపు?

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (18:32 IST)
కర్ణాటక రాష్ట్రంలో ఘోరం జరిగింది. కర్ణాటక, పుత్తూరు తాలూకాలోని, సంతలో ఓ మహిళ చేతిలో బిడ్డతో నడిచి వెళ్తుండగా వెనుకనుంచి వచ్చిన జీపు.. తల్లీబిడ్డలపై ఎక్కి దిగింది. వెంటనే ఆ సంతలోని ప్రజలు హుటాహుటిన మహిళను, బిడ్డను కాపాడారు. ఈ ఘటనలో చిన్నపాటి గాయాలతో తల్లీబిడ్డ తప్పించుకున్నారు. 
 
ఈ ఘటనపై పోలీసులు జీపు డ్రైవర్ వద్ద జరిపిన విచారణలో.. జీపును తాళంతో అలానే నిలబెట్టి.. పక్క షాపుకు వెళ్లాడని.. ఆ సమయంలో అక్కడ ఆడుకుంటున్న చిన్నారులు.. జీపు తాళాన్ని మెల్లగా తిప్పేశారు. దీంతో వేగంతో ముందుకు నడిచిన జీపు.. సమీపంలో చేతిలో బిడ్డతో సహా నడిచి వెళ్తున్న మహిళపై ఎక్కి దిగింది. ఆపై ఓ గోడకు ఢీకొని ఆగిపోయింది. 
 
ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చేతిలో బిడ్డతో నడుస్తూ వెళ్తున్న మహిళను వెనకు నుంచి వచ్చిన జీపు ఎక్కి దిగడానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా షాకవుతున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments