Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కడుపునొప్పితో ఆపరేషన్ చేసుకుంటే.. కత్తెరను పెట్టి కుట్టేశారు..

కడుపునొప్పితో ఆపరేషన్ చేసుకుంటే.. కత్తెరను పెట్టి కుట్టేశారు..
, శనివారం, 9 ఫిబ్రవరి 2019 (12:03 IST)
కడుపునొప్పితో అల్లాడిపోయి ఓ మహిళ ప్రభుత్వాసుపత్రికి వెళ్తే.. అక్కడ వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయాలని సూచించారు. కానీ వైద్యులు ఆపరేషన్ చేస్తూ చేస్తూ ఆమె కడుపులోనే కత్తిరిని మరిచిపోయారు. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదుకు చెందిన మహేశ్వరి చౌదరి హెర్నియా సమస్యతో మూడు నెలల క్రితం నిమ్స్ ఆస్పత్రితో ఆపరేషన్ చేయించున్నారు. 
 
కానీ ఆపరేషన్ తర్వాత కూడా ఆమె ఆరోగ్యం క్షీణించింది. అంతేగాకుండా తీవ్రమైన కడుపునొప్పి రావడంతో వైద్యులు శనివారం స్కానింగ్ చేయించారు. ఈ స్కానింగ్‌లో తన కడుపులో కత్తెర వున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ విషయాన్ని విని మహేశ్వరి షాకయ్యారు. 
 
ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ రోగి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. దీంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంకా ఈ కేసు కన్జ్యూమర్ కోర్టులో విచారణకు రానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాల దుకాణం.. షెడ్‌లో అత్యాచారం.. ఆపై హత్యకు గురైన మహిళ?