Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో హంగ్... రేవణ్ణకు బీజేపీ గాలం... 10 మంది ఎమ్మెల్యేలు జంప్...

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటున్నారు.

Webdunia
మంగళవారం, 15 మే 2018 (15:30 IST)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటున్నారు. ఇందులోభాగంగా, 40 సీట్లతో మూడో స్థానంలో ఉన్న జేడీఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జేడీఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వస్తే బయట నుంచి మద్దతు ఇస్తామని కాంగ్రెస్ అధినాయకత్వం ప్రకటించింది.
 
ఇదిలావుంటే, మ్యాజిక్ ఫిగర్‌కు కాస్త దూరంలో నిలిచిపోయిన బీజేపీ కూడా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. ఇందులోభాగంగా దేవెగౌడ కుమారుడు రేవణ్ణతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. తనతో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. మద్దతు ఇచ్చేందుకు తాను సిద్ధమని బీజేపీకి రేవణ్ణ భరోసా ఇచ్చినట్టు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే... కన్నడ నాట బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
 
ఇదిలావుండగా, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 104 స్థానాలను దక్కించుకుంది. సాధారణ మెజారిటీకి కాస్త దూరంలో బీజేపీ ఉంది. రెండోస్థానంలో కాంగ్రెస్‌ ఉండగా జేడీఎస్‌ కీలకంగా మారింది. కాగా కాంగ్రెస్, జేడీ(ఎస్) కూటమిగా పీఠం ఎక్కేందుకు రెడీ అవుతున్నాయి. కాంగ్రెస్ 77 స్థానాల్లో పట్టు నిలుపుకుంటే.. జేడీ(ఎస్) 40 స్థానాల్లో గెలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments