Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ దళిత ఎంపీకి అవమానం : దైవ దర్శనాన్ని అడ్డుకున్న యాదవులు

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (15:09 IST)
కర్నాటక రాష్ట్రంలో అధికార బీజేపీ ఎంపీకి ఘోర అవమానం జరిగింది. ఆయన దళితుడు కావడమే ఈ అవమానానికి ప్రధాన కారణం. ఈ దళిత ఎంపీ తమ ప్రాంతంలో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ ఆ యాదవులంతా ముక్తకంఠంతో కోరారు. దీంతో ఆ బీజేపీ దళిత ఎంపీ మిన్నకుండిపోయారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటక రాష్ట్రానికి ఏ.నారాయణస్వామి బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఈయన దళిత సామాజిక వర్గానికి చెందిన నేత. నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆయన తుమకూరులోని యాదవుల గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుందామనుకున్నారు. కానీ అతడిని ఆ కులస్తులు గుళ్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. 
 
ఈ సంఘటనపై నాగరాజు అనే వ్యక్తి స్పందిస్తూ, మేమంతా చాలా సాంప్రదాయవాదులం. మా గుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. అణగారిన వర్గానికి చెందిన వ్యక్తి గుడిలో అడుగు పెడితే కీడు జరుగుతుందని కుల పెద్దలు చెప్పడంతో అతడిని గుళ్లోకి రానివ్వలేమని అన్నారు.
 
ఈ సంఘటనపై ఎంపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, భారతదేశం కుల, మతాల సమ్మేళనం, భిన్నత్వంలో ఏకత్వం అనేవి ఉట్టి మాటలేనని మరోసారి రుజువైంది. పార్లమెంట్‌ మెంబర్‌కే ఇలాంటి అవమానం జరిగినపుడు గ్రామాల్లో సాధారణ ప్రజల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి దేశంలో ఇకనైనా మారాలని ఆశిద్దాం అంటూ వ్యాఖ్యానించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments