సీఎం కుమార స్వామికి తాత్కాలిక ఊరట : యధాతథ స్థితిని కొనసాగించండి.. సుప్రీం

Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (14:41 IST)
కర్నాటక ముఖ్యమంత్రి హెచ్.డి.కుమార స్వామికి తాత్కాలిక ఊరట లభించింది. రెబెల్ ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాల ఆమోదంపై సత్వర నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ అపెక్స్ కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో తమ రాజీనామాలను తక్షణం ఆమోదించాలని కోరుతూ రెబెల్ ఎమ్మెల్యేలు మరోమారు కోర్టును ఆశ్రయించారు.
 
ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ప్రస్తుతానికి యధాతథ స్థితిని మంగళవారం వరకు కొనసాగించాలని ఆదేశించింది. వీరి పిటిషన్ పై మళ్ళీ విచారణ జరుపుతామని సూచించింది. వీరి రాజీనామాల విషయమై తానింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తనకు కొంత వ్యవధి కావాలని స్పీకర్ రమేష్ కుమార్.. కోర్టును అభ్యర్థించారు. 
 
ఆయన తరపున సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ వాదిస్తూ.. తన క్లయింటు చేసిన వినతిలోని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని కోరారు. రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌లో ఔచిత్యం లేదన్నారు. వారి రాజీనామాలపై నిర్ణయం తీసుకోవలసిందిగా స్పీకర్‌ను కోర్టు ఆదేశించజాలదని సింఘ్వీ అన్నారు. పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం కింద.. వారి రాజీనామాలపై స్పీకరే నిర్ణయం తీసుకోవలసి ఉంటుందన్నారు. 
 
ఇలావుండగా, రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని కోరుతున్నట్టు సీఎం కుమారస్వామి శాసన సభలో ప్రకటించారు. సభలో మెజారిటీని నిరూపించుకోవడానికి అనుమతించాలని ఆయన స్పీకర్‌ను అభ్యర్థించారు. తన ప్రభుత్వ మనుగడకు సంబంధించి అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని కుమారస్వామి కోరారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు ముఖ్యమంత్రి కుమార స్వామికి పెద్ద ఊరటనిచ్చాయని చెప్పొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments